మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శిగా వేల్పుల ప్రవీణ్ కుమార్

Published: Tuesday April 06, 2021
రాష్ట్ర అధ్యక్షులు పసుల రాంమూర్తి చేతులమీదుగా నియామకపత్రం
జగిత్యాల, ఏప్రిల్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లాలో జరిగిన సమావేశంలో తెలంగాణ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వేల్పుల ప్రవీణ్ కుమార్ ను నియమించారు. ప్రవీణ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు పసుల రమూర్తికి నా వృధాయపూర్వక జై భీంలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్నారు.