బస్సుల కోసం విద్యార్థులు రాస్తారోక చేవెళ్ల నియోజకవర్గం (బ్యూరో )ప్రజా పాలన

Published: Saturday November 05, 2022
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మండలం ఎన్కేపల్లి గేట్ దగ్గర ఉదయం  బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.  విద్యార్థులు మద్దతుగా చేవెళ్ల మండలం కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ మద్దతు తెలిపారు......... ఈ సందర్బంగా వారు .....మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందని. చేవెళ్ల డివిజన్లో బస్సుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పంది విద్యార్థులు సమయానికి అనుకూలంగా నడపాలని లేకుంటే వేల మంది విద్యార్థులతో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రహదారుల ను 
నిర్బంధం  చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, దామరగిద్ద యువ నాయకులు నరేష్,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.