విధినిర్వహణలో మెరుగైన సేవలకు రివార్డులు
Published: Friday August 06, 2021
సన్మానించి అభినందించిన సిఐ మురళి
మధిర, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : పోలీస్ శాఖలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న సిబ్బంది వారి విధుల పట్ల నిర్వహించిన బాధ్యతాయుతమై సేవలను గుర్తిస్తూ పలువురిని సిఐ రివార్డులతో సన్మానించారు. మధిర సర్కిల్ కార్యాలయంలో బుధవారం సీఐ ఓ మురళి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్కిల్ పరిధిలో విధినిర్వహణ లో కీరోల్ పోషించిన సర్కిల్ కార్యాలయ రైటర్ నాగేశ్వరరావు ఐడబ్ల్యూ క్రైంరైటర్ వాసు ఎర్రుపాలెం పిఎస్, టెక్నికల్ టీంకు చెందిన మహిళా కానిస్టేబుల్మాధవి మధిరరూరల్, బ్లూకోట్ విభాగంకొండ రామారావు మధిర టౌన్లను నగదు రివార్డుల తో సన్మానించి, అభినందించారు. ఈసందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా సిపి ఆదేశాలకు అనుగునంగా వైరా ఎసిపి పర్యవేక్షణలో మధిర సర్కిల్ పరిధిలో లా అండ్ఆర్డర్తోపాటు కోర్టు కేసుల నిర్వహణ. వాహనాల తనిఖీలు, బందోబస్తు, కేసుల అన్లైన్ అప్డేట్ల నిర్వహణలో ఎస్టెచ్వోలు, సిబ్బంది సమిష్టి బాధ్యతను నిర్వహించే చర్యలలో బాగంగా మెరుగైన సేవలు. అందిస్తున్న వారికి ప్రోత్సహించడం జరిగిందన్నారు. మధిర సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలు, నేరాల అదువు, పెట్రోలింగ్ విషయాల్లో ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని మధిరటౌన్, అని, బోనకల్, ఎర్రుపాలెం ఎస్ఎస్ఐలు సోమసతీష్ కుమార్, రమేష్కుమార్, ఉదయ్ కిరణ్, కొండల్రావులతో పాటు ప్రొజెషనరీ ఎస్ఐలు ఉన్నారు.
Share this on your social network: