పేదలకు వరం లాంటిది సీఎం సహాయనిధి కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి
Published: Wednesday November 02, 2022
మేడిపల్లి, నవంబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి)
పేద ప్రజల పాలిట సీఎం సహాయనిధి వరం లాంటిదని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజి రెడ్డి పేర్కొన్నారు. డివిజన్లోని ఎం విజయలక్ష్మీకి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ16,500/ చెక్కును లబ్ధిదారులకు అందజేసిన కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజి రెడ్డి.
ఈ సందర్భంగా కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తుందని,బాధితులు అవసరమైన సమయాల్లో సీఎం సహాయ నిధిని సద్వినియోగపర్చుకోవాలని సూచించారు.
Share this on your social network: