ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభల వాల్పోస్టర్ విడుదల* * ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మస్కు

Published: Thursday December 01, 2022

      భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇబరహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత 17 వ మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది.  ఈ సంద్భంగా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మస్కు చరణ్ మాట్లాడుతూ ఈ మహాసభలు డిసెంబర్ 13- 16 వరకు హైదరాబాద్ ఉస్మనియా యూనివర్సిటీ లో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ మహాసభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి ,  ఎస్ఎఫ్ఐ  మాజీ భారత నాయకులు మాణిక్ సర్కార్ హాజరవుతున్నారు.
ఈ మహాసభల తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్ నగరంలో జరగబోతోంది ఈ యొక్క మహాసభల సందర్భంగా 13వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈ యొక్క బహిరంగ సభకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష కార్యదర్శులు తరంగ్ ,  మద్దెల శ్రీకాంత్ , నాయకులు లక్ష్మణ్ సందీప్ వర్షిత్ భాను* శివ తదరులు పాల్గొన్నారు