సిపిఐ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

Published: Thursday November 25, 2021
యాదాద్రి నవంబర్ 24 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని గుర్నాద్ పల్లి లో అరూర్ పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగడం లేదని,రైస్ మిల్లుల వద్ద దిగుమతులు కాక యజమానులు పేచీలు పెడుతున్నారని అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి పోలేపాక యాదయ్య కోరారు.ఈ కార్యక్రమంలో బుర్ర మల్లేశ్,సాయికుమార్,పాక మహేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు.