క్రికెట్ టోర్నీ బ్రోచర్ విడుదల చేసిన సునీతారెడ్డి

Published: Monday February 15, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 13 ( ప్రజాపాలన ) : వికారాబాద్ జిల్లా పరిధిలోని యాలాల్ మండల కేంద్రంలో ఫిబ్రవరి 22 నుండి తలపెట్టిన పట్నం సునీత మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్ని ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, పట్నం రినీష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాలాల్ మండల జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణి, టిఆర్ఎస్ యూత్ వింగ్ నాయకులు సిద్రాల శ్యామ్ ప్రసాద్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ గంతల్ మోయిజ్, ప్రసాద్ కుమార్, కుర్వ మహిపాల్, కుర్వ విజయ్ పాల్గొని పట్నం రినీష్ రెడ్డిని టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారితో పాటు టీం రినీష్ రెడ్డి ఫర్ రెవల్యూషన్ యాలాల్ మండల సభ్యులు సంకారం లాలూ, ఇంతియాజ్, గడ్డం బాలు, ఇబ్రహీం, ఆరిఫ్, గంతల్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments are