పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Published: Monday July 05, 2021
గుమ్మడిదల మండలంలోని అనంతరం, కానుకుంట, వీరరెడ్డిపల్లి, కొత్తపల్లి, నల్లవల్లి, మాంబాపూర్ తదితర గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మరియు సిబ్బందికి అక్షయ పాత్రవారి సహకారంతో మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్, ఫౌండేషన్ సభ్యులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచులు, కార్యదర్శిలు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.