ఘనంగా ఎంపీపీ మేనేని స్వర్ణలత రాజ నర్సింగరావు జన్మదిన వేడుకలు

Published: Tuesday August 03, 2021
కొడిమ్యాల, ఆగస్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పరిషత్ లో సోమవారం రోజున మండల పరిషత్ అధ్యక్షురాలు మేనేని స్వర్ణలత రాజ నర్సింగరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు, అనంతరం మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, కొడిమ్యాల  మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ మేనేని రాజ నర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్ల పెళ్లి ప్రసాద్ నాయకులు నెరేళ్ళ మహేష్, గుండు రాజ్ కుమార్, వివిధ  గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో చైర్మన్ లు, వార్డ్ మెంబర్లు, నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.