గ్రామ పంచాయతీలో వ్యాక్సినేషన్ సబ్ సెంటర్ ప్రారంభం.

Published: Friday September 17, 2021
కొడిమ్యాల సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామపంచాయతీ నందు కోవిడ్ వాక్సినేషన్ సబ్ సెంటర్ ను ఎంపీపీ మేనినీ స్వర్ణలత రాజనర్సింగరావు, సర్పంచ్ అంబటి లత తిరుమలేష్, ఎంపీడీవో పద్మజ, ఏ పీ ఓ, వైద్య అధికారి శ్రీనివాస్, ఏ ఎన్ ఎం రాజేశ్వరి ప్రారంభించడం జరిగింది. గ్రామ ప్రజలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వాక్సిన్ వేసుకోవాలని, దీనిపై ఎలాంటి అపోహలు నమ్మకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి వాక్సిన్ వేసుకోవాలని ఎంపీపీ మరియు సర్పంచ్ వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.