అన్నదానాన్ని ప్రారంభించిన కూచిపూడి వెంకటేశ్వరరావు

Published: Monday May 30, 2022
తల్లాడ, మే 28 (ప్రజాపాలన న్యూస్):
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను తల్లాడ మండల పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుండేటి వీరారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి మూకర ప్రసాదు, సరికొండ వీరంరాజు, పొట్టేటి బ్రహ్మారెడ్డి, సరికొండ శ్రీనివాసరాజు, పరుచూరి కృష్ణ, కొమ్మినేని వెంకటేశ్వరరావు, దుగ్గినేని వెంకటయ్య, రామయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు