లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో స్మశానవాటిక నిర్మాణం

Published: Tuesday March 30, 2021
బెల్లంపల్లి, మార్చి 29, ప్రజాపాలన : బెల్లంపల్లి నియోజకవర్గంలో ని మేజర్ గ్రామపంచాయతీ లో ప్రత్యేకంగా స్మశాన వాటిక లేకపోవటంతో లయన్స్ క్లబ్ ఆ ద్వర్యంలో తాండూరు పెద్ద చెరువు వద్ద ప్రత్యేకంగా స్మశావాటి నిర్మాణం చేపడుతున్నా మని తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సురభి ఆగమరావు సోమవారం నాడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ స్మశాన వాటిక నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు ఈ కార్యక్రమంలో జడ్ పి టి సి, సాలిగామ బాణయ్య,ఎం పి టీ సి, సిరంగి శంకర్, సర్పంచ్ నవీన్, లయన్స్ క్లబ్ కార్యదర్శి మద్దికుంట చందు, సభ్యులు గాజుల రమేష్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.