రాష్ట్ర మహాసభలు పోస్టర్ ఆవిష్కరణ శంకరపట్నం డిసెంబర్ 23 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Saturday December 24, 2022

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలు ఖమ్మం జిల్లాలో 29 30 31 తేదీలలో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని శుక్రవారము  శంకరపట్నం మండలం వంకాయగూడెం కూలీలతో పోస్టర్ ఆవిష్కరణ చేసారు. ఈ మహాసభలకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ హాజరవుతున్నారు కావున కార్మికులు వ్యవసాయ కూలీలు ఉపాధి కూలీలు హాజరై జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మైదం శెట్టి యుగంధర్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.