పలువురు బీజేపీ పార్టీలో చేరిక

Published: Saturday February 20, 2021
బాలాపూర్ : ప్రజాపాలన: బడంగ్ పేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిలివేరి ఈశ్వర్, వరికుప్పుల రవి బీజేపీలో చేరారు. శుక్రవారం నాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, నాదర్ గుల్ బీజేపీ కార్యాలయంలో కాషాయం కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ప్రజా సంక్షేమం, సమస్యలు సీ ఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు శ్రీరాములు యాదవ్. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ జీ.ఎస్ జోరాల ప్రభాకర్, వరికుప్పల వెంకటేష్, అంజయ్య ముదిరాజ్, నాగనందీశ్వర్ రెడ్డి సహా బీజేపీ నాయకులు పాల్గొన్నారు