మాజీ మంత్రి జలగం విస్తృత పర్యటన

Published: Friday February 19, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల: (ప్రజా పాలన)  ఫిబ్రవరి 18: మాజీ మంత్రి జలగం ప్రసాద రావు  గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. గత కొంత కాలంగా మండలంలోని గిరిజనుల సాగుభూములకు విద్యుత్ సౌకర్యం తో పాటు విద్యుత్ మోటర్లను జేవీర్ ట్రస్ట్ ఏర్పాటుచేస్తుంది. ఈ క్రమంలో ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి వినతులు శ్వీకరించారు. పాత గంగారం, నర్సాపురం, తోగూడెం గ్రామాల్లో రైతులతో పాటు సాగుభూములను పరిశీలించి వాటికి ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిగురించి అధికారులతో చర్చించారు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు జలగం వెంగళరావు ట్రస్ట్ ద్వారా  సబ్ మోర్స్బైల్ మోటార్లు  సగం  ధరకే ఇవ్వనున్నామని తెలిపారు. పాత గంగారం నుంచి కోటమ్మ గుడి మీదుగా వెళ్లే రహదారిని ఈజీఎస్ నిధులతో నిర్మాణం చేయొచ్చని రైతులకు తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీ తులసీ, గంగారం సర్పంచ్ వాడే లక్ష్మీ, తాండ్ర రాంబాబు, పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు పూర్ణ చందరావు, పామర్తి నాగేశ్వరరావు, రత్న భూషణం తదితరులు పాల్గొన్నారు