భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల లబ్దిదారులకు తక్షణ సాయం

Published: Thursday July 21, 2022

 ఎమ్మెల్యే డా. సంజయ్

జగిత్యాల, జులై 20 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ మరియు అర్బన్ మండలానికి చెందిన లబ్దిదారులకు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 49 ఇండ్లకు తక్షణ సాయంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన మొత్తాన్ని  49 మంది లబ్దిదారులకు పట్టణ ఎస్.వి.ఎల్.ఆర్ గార్డెన్స్ లో  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ భోగ శ్రావణి ప్రవీణ్, జెడ్పీటీసీ మహేష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.