పీర్జాదిగూడలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ

Published: Tuesday July 27, 2021
మేడిపల్లి, జూలై 26 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆహార భద్రత కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడాని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు నూతన ఆహార భద్రత కార్డులను ఈ సేవ నుండి పొందవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ ఎం.శ్రీనివాస్, తహసీల్దార్ ఎస్తేరు అనిత, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి, అమర్ సింగ్, తూముకుంట్ల ప్రసన్న లక్ష్మీ, బండారు మంజుల, కుర్ర షాలిని, అలువాల సరిత, కౌడే పోచయ్య, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎన్. మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, పప్పుల రాజేశ్వరి, కో ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి, పప్పుల అంజి రెడ్డి, అలువాల దేవేందర్ గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, బైటింటి ఈశ్వర్ రెడ్డి, యాసారం మహేష్, బొడిగే కృష్ణా గౌడ్, తూముకుంట్ల శ్రీధర్ రెడ్డి, పాశం బుచ్చి యాదవ్, బండారు రవీందర్, బండి సతీష్ గౌడ్, చెరుకు పెంటయ్య గౌడ్, మనోరంజన్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, నిర్మల, బండి శ్రీరాములు గౌడ్, సుక్క జయేందర్, మండల ఆర్ ఐ ఫనిందర్, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.