2.38 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు

Published: Wednesday June 23, 2021
బాలపూర్, జూన్ 22, ప్రజాపాలన ప్రతినిధి : పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లొ పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు మంగళవారం నాడు శంకుస్థాపన చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి 8వ, 9వ, 13వ, 14వ, 27వ డివిజన్ లకు సంబంధించిన సుమారు 2 కోట్ల 38 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డి, జెనిగే భారతమ్మ కోమరయ్య యాదవ్, ఇంద్ర సేన, బాలు నాయక్, నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, బండారి మనోహర్, ఏనుగు రాంరెడ్డి, సుర్ణగంటి అర్జున్, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, యతం పవన్, సుక్క శివ కుమార్, కో ఆప్షన్ సభ్యులు మర్రి జగన్ మోహన్ రెడ్డి, డీఈఈ అశోక్ రెడ్డి, ఏఈఈ లు బిక్కు నాయక్, రాంప్రసాద్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, జెనీగ శ్రీనివాస్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, మహిళలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.