ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలన

Published: Monday December 05, 2022

శంకరపట్నం డిసెంబర్ 03 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండల పరిధిలోని గ్రామాలలో రెండు రోజులపాటు నిర్వహించే  ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహణలో భాగంగా మండలంలోని అంబాలపూర్,తాడికల్, మొలంగూర్,మెట్టుపల్లి, లింగాపూర్, ఆముదాలపల్లి, కొత్తగట్టు, గొల్లపల్లి, గ్రామాలలో బిఎల్లో ఓటర్ నమోదు కేంద్రాలను సందర్శించి ప్రజలతో మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ రెండు రోజుల ప్రత్యేక ఓటరు నమోదు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారనరు 18 ఏళ్లు నిండిన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ముందస్తు దరఖాస్తు చేసుకోవాలని కోరారు కళాశాల ప్రిన్సిపాల్ నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి విద్యార్థి పేరును ఓటరుగా జాబితాలో పేరు నమోదు చేసుకుని వారిని గుర్తించి నమోదు చేసుకునేలా చూడాలని గ్రామాలలో చర్యలు తీసుకోవాలని అన్నారు స్వచ్ఛంద సంస్థ సంఘాలు సభ్యులు ప్రజాప్రతినిధులు తమ పరిధిలో అర్హత కలిగి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోని వారిని గుర్తించి నమోదు చేయించేలా చూడాలని  అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, ఆర్ ఐ లక్ష్మణ్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు, బి ఎల్ ఓ సిబ్బంది ఉన్నారు.