అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బీపీ నాయక్
Published: Wednesday December 07, 2022
బోనకల్, డిసెంబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: స్థానిక మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపరినిర్వాన్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ యువనేత బీపీ నాయక్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సభ్యులందరితో కలిసి ఘన నివాళులు అర్పిస్తూ, అంబేద్కర్ మన దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమని, ఆ మహనీయుడి పోరాటాలు లక్షలాది మందికి స్ఫూర్తిని కలిగిస్తాయని మరియు భారతదేశానికి విస్తృతమైన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదనీ స్మరించుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షులు రవి ప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్, బాలకృష్ణ, తరుణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: