మిలీనియం పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Published: Saturday August 20, 2022

మధిర రూరల్ ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధిస్థానిక మిలీనియం టాలెంట్ హైస్కూల్లోశుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థులు కృష్ణుడు,గోపికలు, రాధ వేషధారణతో ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రైమరీ సెక్షన్ ప్రిన్సిపాల్  సాధినేని రాజేశ్వరి ప్రారంభించి ముందుగా విద్యార్థిని, విద్యార్థులకు కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణుని జన్మదిన సందర్భంగా కృష్ణాష్టమి జరుపుకుంటామని కృష్ణ తత్వం గురించి వివరించారు. తదనంతరం విద్యార్థులచే ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్  శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.