టిఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి : వికారాబాద్ మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు గయాజ్
Published: Thursday September 09, 2021
వికారాబాద్ బ్యూరో 08 సెప్టెంబర్ ప్రజాపాలన : టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సకల జనులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ కమిటీలను మండల అధ్యక్షుడు కమాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియమించారు. ఈ సందర్భంగా గయాజ్ మాట్లాడుతూ.. వికారాబాద్ మండలంలో టిఆర్ఎస్ పార్టీని బలోపేతం కొరకు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ పటిష్ఠమవడమే కాకుండా సంక్షేమ పథకాలను అవగాహన పరిచి చైతన్యం చేయాలని కోరారు.
Share this on your social network: