దళితుల సాధికారత కోసమే దళిత బంధు

Published: Saturday February 04, 2023
 ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
మేడిపల్లి, ఫిబ్రవరి 3 (ప్రజాపాలన ప్రతినిధి)
దళిత కుటుంబాల సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని  ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం దళిత బంధు పథకం కింద హబ్సిగూడకు చెందిన చెంచాల శ్రీనివాస్ కు మంజూరైన శ్రీ దత్త ఎంటర్ప్రైజస్ బ్యాటరీస్ యూనిట్ ను  ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చెంచాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.