అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
Published: Wednesday March 31, 2021
జగిత్యాల, మర్చి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని 5,21,22, 37వ వార్డుల్లో సుమారు 24 లక్షల రూపాయల నిధులతో పలు సిసి రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణి కమిషనర్ మారుతి ప్రసాద్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్లు అల్లే గంగసాగర్ గుగ్గిల హరీష్ పులి రమ గట్టు సతీశ్ గిరి డిఈ లచ్చిరెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: