మేకవనంపల్లీలో మాదిరి ఎన్నికల నిర్వహణ : సర్పంచ్ శశిధర్ రెడ్డి

Published: Wednesday December 08, 2021
వికారాబాద్ బ్యూరో 07 డిసెంబర్ ప్రజాపాలన : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేకవనంపల్లిలో మాదిరి ఎన్నికలు నిర్వహించారని సర్పంచ్ శశిధర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారో స్వయంగా, స్వానుభవంగా తెలుసుకునే అవకాశం కల్పించిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో పాల్గొని ఓటు వేయడానికి పూర్తి అవగాహన పొందుటకు మాదిరి ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడుతాయని స్పష్టం చేశారు. తరచూ విద్యార్థులకు ఉపయుక్తమైన కార్యక్రమాలు నిర్వహించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.మల్లయ్య, సి.వేణుగోపాల్, పి.అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు సమత, అనురాధ, గీతానందిని, అమృత, వెంకటయ్య, జె.వెంకటయ్య, అశోక్, ప్రేమలత, వెంకట లక్ష్మీ, గీతాంజలి, జ్యోత్స్న, సూర్యప్రకాష్, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.