ప్రాథమిక పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలు.

Published: Monday September 26, 2022

జన్నారం, సెప్టెంబర్ 25, ప్రజాపాలన: మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక కోన్నత ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో విద్యార్థుల, చేత ఎంగిలి పూల బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తిమ్మాపూర్ సర్పంచ్ జాడి గంగాధర్ అన్నారు. అదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణా బతుకమ్మ పండుగ ప్రతిదిక సంస్కృతి, సంప్రదాయాలకు నిలుస్తుందని అయన సూచించారు. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులలో తొమ్మిది రకాల పేర్లుతో మహిలందరు కలసి బతుకమ్మ పాటలు పాడుతూ జరుపుతుంటారు. ఈ కార్యాక్రమంలో తిమ్మాపూర్ యుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, సిబ్బంది, మహిళలు, విద్యార్థినీ లు, గ్రామస్థులు, పాల్గొన్నారు.