రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్న ప్రజలు
Published: Monday July 11, 2022
పాడైన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే దే
బీజేపీ రాష్ట్ర నాయకులు
కట్రావత్ మోహన్ నాయక్
ఇటీవల కురుస్తున్న వర్షాలకు వైరా నియోజకవర్గం లో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా, గుంటలతో ఉండటం తో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అని బీజేవైయం రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కట్రావత్ మోహన్ నాయక్ గారు అన్నారు.
ప్రజా ప్రతినిధులు తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించాలి అని డిమాండ్ చేశారు అభివృద్ధి పనుల పేరుతో చాలా కాలనీల్లో రోడ్లు తొవ్వి వదిలేసారు అని వాటికి వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చెయ్యాలని విజ్ఞప్తి చేసారు
Share this on your social network: