మంచి ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ పాఠశాల పేరును నిలబెట్టాలి

Published: Saturday May 21, 2022
మేయర్ జక్కా వెంకట్ రెడ్డి
మేడిపల్లి, మే20 (ప్రజాపాలన ప్రతినిధి)
విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ పాఠశాలకు పేరును తీసుకురావాలని
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్  మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి దేవి పూజ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, స్థానిక  కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి  పాల్గొని జ్యోతి వెలిగించి, పదవ తరగతి విద్యార్ధులకు హాల్ టికెట్స్ ను పంపిణీ చేశారు. 
 ఈ సందర్భంగా  కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ  పాఠశాలలో 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్ధులకు రూ 10 వేల నగదు బహుమతులు అందిస్తానని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్యప్రసాద్,వెంకటేష్,తిరుమలేష్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.