వెల్చాల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి కళ్యాణ మహోత్సవం

Published: Saturday March 04, 2023
వికారాబాద్ బ్యూరో 03 మార్చి ప్రజాపాలన : మోమిన్ పేట్ మండల పరిధిలో గల వెల్చాల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి కళ్యాణ మహోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాతలు భక్తులు చుట్టు పక్కగ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.