రిటైర్డ్ రైల్వే తెలుగు టీచర్ మృతి.. పలువురు సంతాపం

Published: Tuesday March 08, 2022
మధిర మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మధిర సిద్ధారెడ్డి బజారుకు చెందిన విశ్రాంత రైల్వే తెలుగు ఉపాధ్యాయులు తోట లక్ష్మీనారాయణ (75) అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి పలువురు సంతాపం తెలిపి ప్రగాఢ సానుభూతిి తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాజీపేటడోర్నకల్ రైల్వే స్కూల్ లో ఎక్కువ కాలం పనిచేసి పదవీ విరమణ పొందారు. మితభాషిగా, సౌమ్యుడిగా వివాదాలకు దూరంగా ఉంటూ తనదయిన శైలిలో ముద్రవేసుకుని అందరి ప్రశంసలు పొందారు. ఆళ్ళ శ్రీనివాస్ రావు, జి ఎల్ నారాయణ, కె.వెంకన్న ఆర్టీసీ, వీళ్ళ మామగారైన తోట లక్ష్మీనారాయణకు ఘన నివాళులు అర్పించారు. మున్నూరు కాపు మధిర నియోజకవర్గం అధ్యక్షుడు ఆళ్ల కృష్ణాతో పాటుగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, దనిశెట్టి భాస్కర్, రంగిశెట్టి శెట్టి కోటేశ్వరరావు, తిరువీధుల వెంకటేశ్వరరావు, చల్లమల్ల శ్రీనివాసరావు, తోగర్ ఓంకార్, నీలం వెంకటేశ్వరరావు, ఆళ్ళ శంకర్ రావు, దేవరపల్లి సుబ్రహ్మణ్యం, మందడపు వెంకటనారాయణ, బుసా కోటేశ్వరరావు,సాధం వెంకటేశ్వరరావు, దనిశెట్టి శ్రీనివాస రావు, సిద కృష్ణ, కల్యాణపు నాగరాజు, రామిశెట్టి  నాగేశ్వరరావు పలువురు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసారు.