మీతోనే మా పయనం శీనన్న:

Published: Tuesday February 28, 2023

మాజీ కౌన్సిలర్ తాండ్ర జ్యోతి మధిర ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మాజీ కౌన్సిలర్ తాండ్ర జ్యోతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో వారి బాటలోనే మా బాటని రానున్న రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోనే మా పయనం అని మధిర 20వ వార్డు మాజీ కౌన్సిలర్ తాండ్ర జ్యోతి తిరుమలరావు అన్నారు. ఈరోజు కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు డా.కోట రాంబాబు సమక్షంలో పొంగులేటి శ్రీనవాసరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. భవిషత్తు రాజకీయాల్లో శీనన్న వెంట కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం అని, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉండాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా అండగా ఉంటాను అని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో  ప్రముఖ వైద్యులు కోటా రాంబాబు ఎర్రగుంట రమేష్  తాండ్ర తిరుమల్ రావు పాల్గొన్నారు