ఆసరా పింఛన్ కార్డులను అందజేసిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

Published: Saturday September 03, 2022
మేడిపల్లి, సెప్టెంబర్2 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందించిన ఆసరా పింఛన్ల కార్డులను  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ క్రాంతి కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద మేయర్ జక్క వెంకట్ రెడ్డితో కలిసి స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి డివిజన్లోని క్రాంతికాలనీలో  ఇంటింటికి తిరిగి18 మంది లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. కొత్త ఆసరా పెన్షన్ లబ్ది దారులకు కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  
కోఆప్షన్ సభ్యులు జావిద్ ఖాన్, క్రాంతికాలనీ వాసులు, కాలనీ పెద్దలు మరియు పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.