పలు కాలనీలలో సిసి రోడ్లు

Published: Friday June 18, 2021
బాలపూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా పలు డివిజన్లలో సిసి రోడ్డు తప్పనిసరిగా ఉండాలని కార్పొరేషన్ మేయర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ లో 24 వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి ఆధ్వర్యంలో జయశంకర్ కాలనీలో సిసి రోడ్డు ను ప్రారంభించిన ముఖ్య అతిథి కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనరసింహారెడ్డి, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... డివిజన్లోని కాలనీలకు సి సి రోడ్లు ఏర్పాటు చేయడమే కార్పొరేషన్ అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. డివిజన్లో అభివృద్ధి పనులకు ఎల్లవేళలా ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పారు. జయశంకర్ కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ తో కలిసి మేయర్ ను శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు స్థానిక కార్పొరేటర్, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.