సీనియర్ పాత్రికేయుడు సలమోద్దీన్ ను సన్మానించిన వాసవీ క్లబ్ గమందమర్రి, సెప్టెంబర్ 6 ప్రజా పా
Published: Wednesday September 07, 2022
మంచిర్యాల వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో వాసవీ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో అంతర్జాతీయ పాత్రికేయ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులను సత్కరించారు. మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు ఎం.డి సలామోద్దీన్ ను ఘనంగా సన్మానించారు. దశాబ్ద కాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ రాణిస్తున్న ఎం.డి. సలామోద్దీన్ ను వాసవీక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, వనితా క్లబ్ అధ్యక్షురాలు గౌరిశెట్టి, ధనలక్ష్మి, కార్యదర్శి గంప వాసవి, కోశాధికారి కటకం సునీత, జోనల్ చైర్మన్ కాచం సతీష్ ల చేతులమీదుగా ఘనంగా సన్మానించారు. మందమర్రి ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్న ఎం.డి. సలమోద్దీన్ ను సత్కారం పొందిన సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గజ్జెల రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల సంజీవ్, కోశాధికారి బూర్ల రాజ్ కుమార్, సభ్యులు అభినందించారు.
Share this on your social network: