రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Published: Friday November 25, 2022
బెల్లంపల్లి నవంబర్ 24 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో ఒక కోటి 45 లక్షలతో, వివిధ వార్డుల్లో సిసి రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో పట్టణంలోని 12వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో, మరియు మూడో వార్డు, 17వ వార్డు, రవీందర్ నగర్ లో సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, త్వరితగతిన  రోడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ టి, సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత వార్డు కౌన్సిలర్లు నెల్లి శ్రీలత రమేష్, వైస్ చైర్మన్ బత్తుల  సుదర్శన్, గెళ్ళి రాజలింగు, దామెర శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు, తెరాస నాయకులు నెల్లి రమేష్, పోలు శ్రీనివాస్, శ్రీధర్, పలువురు తెరాస నాయకులు, కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సందీప్, టి ఓ అశ్విత్, మున్సిపల్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.