రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం

Published: Friday April 30, 2021
పరిగి, 29 ఏప్రిల్, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల పరిధిలోని దోర్నాల్ పల్లి గ్రామంలో డి సి ఏo ఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్. యాదయ్య సాగర్. మరియు డీసీఎంస్ మేనేoజర్ బి.వెంకటరమణ ప్రారభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళారుల చేతులో మోసపోకుండా కేసీ ఆర్ ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది అన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి సెంటర్ ఇంచార్జి సంతోస్ గ్రామ కార్యదర్శి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.