మహబూబ్ నగర్ జిల్లా
Published: Saturday July 23, 2022
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీని గారిని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ గారి అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క గారు హాజరైనారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం పోస్ట్ ఆఫీస్ ముందు బైఠాయించి కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించడం జరిగింది.
Share this on your social network: