22 లక్షలతో బీట్ రోడ్ పనులు ప్రారంభించిన కార్పొరేటర్

Published: Monday June 14, 2021
బాలపూర్, జూన్ 13, ప్రజాపాలన ప్రతినిధి : అంచలంచలుగా డెవలప్మెంట్ అవుతాయని కాలనీ వాసులతో స్థానిక కార్పొరేటర్ అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ పెండ్యాల శివ పార్వతి నరసింహ్మ ఆధ్వర్యంలో రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... నంది హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 3 నుండి శివాలయం గుడి వరకు బిటి రోడ్డు ను మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుండి 22 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాలని వారితో అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి పనులకు అంతరాయం జరగకుండా ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, స్థానిక కార్పొరేటర్  పెండ్యాల శివపార్వతి ,కాలనీ వాసులు విజయ్ కుమార్, రవి, సత్తిబాబు, రాంరెడ్డి, పాండు నాయక్, మొనా చారి తదితరులు పాల్గొన్నారు.