శంకరపట్నం లో ఘనంగా వాజిపేయి జయంతి వేడుకలు శంకరపట్నం డిసెంబర్ 25 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Monday December 26, 2022

శంకరపట్నం మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు చల్లా ఐలయ్య  అధ్వర్యంలో ఆదివారము మాజీ ప్రధాని,భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించారు .
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతు  వాజ్‌పేయి మన దేశానికి చేసిన సేవలు కొనియాడుతు అంతర్జాతీయ ఒత్తిల్లు ఎన్ని ఉన్నా, దేశ భద్రత గురించి దేనికి వెరవకుండా అణు పరీక్షలు జరిపి దేశాన్ని సురక్షిత స్థానంలో నిలిపారని, తదనంతరం అంతర్జాతీయ ఆంక్షలని సయితం సమర్థంగా ఎదుర్కొని, దేశాన్ని అభివృద్ది పథంలో పరుగులు పెట్టించిన మహనీయుడిని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమములో బీజేపీ మండల ఉపాధ్యక్షులు పెసరి అర్జున్,మంద శ్రీనివాస్ రెడ్డి,అన్నాడి మహేందర్ రెడ్డి,మండల కార్యదర్శి  దాసరపు నరేందర్ ,మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు మందాడి జగ్గా రెడ్డి,దళిత మోర్చా అధ్యక్షుడు కనకం సాగర్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బిజిలి సారయ్య,నాయకులు పల్లె శివారెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు