మహాదేవపురం పాఠశాలను సందర్శించిన ఎంపీపీ మెండెం లలిత మధిర రూరల్ నవంబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి

Published: Friday November 18, 2022

మహాదేవపురం ప్రాధమిక పాఠశాలను ఎంపీపీ  మెండెం లలిత  సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగాా ఆమె మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధిని చూసి పలుుు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటూ  అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేే ప్రభుత్వాన్ని ఆమెె పేర్కొన్నారు అనంతరం అన్నిి తరగతులు స్కూల్లో పచ్చదనం పరిశుభ్రత ప్రగతిని పరిశీలించి విద్యార్థులను మెచ్చుకున్నారు.
అదేవిధంగా ఉపాధ్యాయుల హాజరు మరియు పాఠశాల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు.ఆమెవెంట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్,ఉపాధ్యాయులు వీరయ్య,భాస్కర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.