డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలపై ఉప్పల్ డిసితో చర్చించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకటరావు

Published: Tuesday December 06, 2022
మేడిపల్లి, డిసెంబర్ 5 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావు ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమీషనర్ అరుణ కుమార్ ను కలిసి పలు కార్యక్రమాల పైన చర్చించడం జరిగింది.   రామంతాపూర్లో నిర్మించినటువంటి మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, కోవిడ్ కారణంగా నిలిచిపోయిన
 శుభోదయం రామంతాపూర్ అనే కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని కార్పొరేటర్ డిసిని కోరారు. స్పందించిన డిసి అరుణకుమారి మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ ఈనెల 8వ తేదీన పూజా అనంతరం ప్రజలకు అందుబాటులో తెస్తామని, శుభోదయం రామంతాపూర్ కార్యక్రమాన్ని కూడా ఈ నెల నుండి మొదలు పెడదామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకటరావు పాల్గొన్నారు.