బూస్టర్ డోస్ తీసుకోవాలి*ఎంపీడీవో
Published: Thursday July 28, 2022
మధిర జులై 27 ప్రజాపాలన ప్రతినిధి కోవిడ్ టీకా తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని నిధానపురం గ్రామంలో కొనసాగుతున్న బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావన్నారు. ప్రతి గ్రామంలో వైద్య సిబ్బంది కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వటం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాదా కృష్ణారెడ్డి మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అమరవాది సత్యనారాయణ రెడ్డి ఏఎన్ఎం రాజ్యలక్ష్మి సెక్రటరీ హరి ఆశా కార్యకర్తలు పద్మ, మేరీ పాల్గొన్నారు.
Share this on your social network: