పలు కార్యక్రమాలలో పాల్గొన్న కోటా రాంబాబు

Published: Monday April 18, 2022
మధిర ఏప్రిల్ 17 ప్రజాపాలన ప్రతినిధి పరిధిలో ఆదివారం నాడు మొదటిగా సిద్దారెడ్డి బజారు నందు మందడపు సతీష్ కుమార్తె దుర్గా చాందిని వివాహ ప్రధాన వేడుకకు హాజరై నూతన వధువు ఆశీర్వదించారు అనంతరం సుందరయ్య నగర్ నందు రామిశెట్టి రోశయ్య సతీమణి రామిశెట్టి హైమావతి దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం సిద్దారెడ్డి బజారు నందు ఇటీవలే మరణించిన కోడెం సారంగపాణి  దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమాలలో టీఆరెఎస్ పార్టీ నాయకులు యన్నం కోటేశ్వరరావు జాగృతి నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిల్లపాటి బాబురావు తదితరులు పాల్గొన్నారు