ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనన్ని ఢీకొన్న ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు*
Published: Wednesday January 25, 2023
మధిర రూరల్ జనవరిిి24 ప్రజాపాలన ప్రతినిధి
మధిర మండల పరిధిలోని రాయపట్నం గ్రామంలో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో కృష్ణాజిల్లా రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లెకంటి స్వామి నీలమ్మ దంపతులకు తీవ్ర గాయాలు, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్ అండ్ బి రోడ్డు రోడ్డు ఆక్రమణకు గురి కావడం వలన నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి గ్రామస్తులు తెలిపారు. ఇదే తరుణంలో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదాన్ని స్థానికులు 108కి సమాచారం అందించగా, సిబ్బంది అక్కడికి చేరుకొని పైలెట్ రవీంద్ర ద్వారా క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
Share this on your social network: