కరోన బాధితులకు పౌష్టికాహారం అందించిన సర్పంచ్ మందడపు ఉపేంద్ర
Published: Monday April 19, 2021
మధిర, ఏప్రిల్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని మల్లారం ఎస్సీ కాలనీలో కరోనా బాధితులకు ఈరోజు ఆ గ్రామ సర్పంచ్ మందడపు ఉపేంద్ర పౌష్టిక ఆహారమైన జీడిపప్పు లాంటి డ్రైఫ్రూట్స్ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్య పడకుండా ఉండండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని వారికి తెలిపారు.కరోన వచ్చిన వారు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ సూచనల మేరకు మందులు వాడాలని వారికి సూచించారు.
Share this on your social network: