ఇంతకు ముందు పంపిన న్యూస్ కు సంబంధించిన పోటో తప్పుగా వచ్చింది గమనించ గలరు

Published: Tuesday June 21, 2022
అగ్ని పథ్ ని వెనక్కి తీసుకోవాలి* 
 
-ఎస్.ఎఫ్.ఐ  జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి
 
మంచిర్యాల టౌన్, జూన్ 20, ప్రజాపాలన : అగ్ని పథ్ ని వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ జాతీయ కమిటీ  పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశారు.
 ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  అగ్నిపథ్ స్కీం కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న ఆలిండియా నాయకత్వన్ని అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వం సిగ్గుమాలిన చర్య అని,  ఎస్.ఎఫ్.ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్, డి.వై.ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎ.ఎ రహీమ్, డి వై ఎఫ్ ఐ ప్రధాన కార్యదర్శి హిమగ్నరాజ్ భట్టార్య  , డిల్లీ కార్యదర్శి ప్రీతీష్ మీనన్ ,జె.ఎన్.యు అధ్యక్షురాలు ఐషే ఘోష్ లను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు  చేయడాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన అగ్నిపథ్ వెంటనే రద్దు చేయాలని లేని  యెడల  పలు ఆందోళనలు చేస్తామని  హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పవన్,బదీర, శ్రీను,వంశీ, రామేష్, రాకేష్, వరుణ్, తేజ్, తదితరులు పాల్గొన్నారు.