పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ కోలేటిని సన్మానించిన కె. వి రమేష్ రాజు

Published: Thursday September 02, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, చైర్మన్ శ్రీ దామోదర్  కోలేటిని  మర్యాద పూర్వకంగా కలిసి  సన్మానించిన లయన్ కె.వి.రమేష్ రాజు (డిస్ట్రిక్ట్ చైర్మన్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్) ప్రస్తుత కరోన కష్ట సమయంలో బ్లడ్ బ్యాంకు లలో రక్త నిలువలు లేని కారణంగా ప్రజలకు ఇబ్బందిగా ఉంది. కావున ప్రతి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో, వారి సహాయ సహకారాలతో ప్రతి డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కాలేజీల్లో పోలీస్ బృందాలకు మరియు విద్యార్థుల కు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా, రక్త దానం చేసేవిధంగా ప్రజలను చైతన్యవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ విషయం గా స్పందించి డిజిపి లెవెల్ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ గోలి (తిరుమల నర్సింగ్ హోమ్), పారిశ్రామిక వేత్త జగన్ మోహన్ అంచురి తదితరులు పాల్గొన్నారు.