విద్యార్థులను అభినందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు..

Published: Thursday June 30, 2022

ఏన్కూరు, జూన్ 28 (ప్రజాపాలన న్యూస్): ఏన్కూరు మండల పరిధిలోని తిమ్మరావుపేట గ్రామంలో ఉన్న ఓం ఆదిత్య గాయత్రి స్కూల్ విద్యార్థులు ఉగ్గం అశ్వంత్, వీరోజు దీక్షిత తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట లో సీట్లు సాధించారు. ఈ విద్యార్థులు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో గెలుపొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 సీట్లలో 2 సీట్లు సాధించారు. ఈ విజయాలు సాధించడం పట్ల బుధవారం ఆ విద్యార్థులను విద్యార్థులను ఏన్కూరు మండల విద్యాశాఖ అధికారి జయరాజు, ఎంపీడీఓ అశోక్, తహశీల్దార్ ఖాసీం సాహూ, ఎస్సై శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఆర్ఐ రాజశేఖర్, సూపెరడెంట్ కృష్ణ, పిఇటి శోభన్ లు విద్యార్థులను అభినందించారు.స్కూల్ యాజమాన్యం దాసరి రమేష్, అంతోటి రామకృష్ణ, మండల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి మండల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ విద్యార్థులు సీట్లు సాధించడం కోసం సహాయం అందించిన మండల పిఇటిలు వీర రాఘవులు,శోభన్, ఉపాధ్యాయులు ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.