విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం వితరణ..

Published: Friday March 11, 2022
తల్లాడ, మార్చి 10న (ప్రజాపాలన న్యూస్): తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పులబాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం లూర్ధు మాత ఉన్నత పాఠశాల లో 10వ తరగతి  విద్యార్థులకు స్టడీ అవర్స్ సందర్భంగా అల్పాహారం వితరణగా అందించారు. కర్నాటి లక్ష్మారెడ్డి, జవ్వాజి నగేష్, రూ 7 వేల రూపాయలు అల్పాహారం నిమిత్తం వితరణ చేశారు. పిల్లలకి అల్పాహారం ఇచ్చిన లక్ష్మారెడ్డికి నగేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వేమిరెడ్డి వెంకట నారాయణరెడ్డి, ట్రెజరర్ దగ్గుల నారాయణరెడ్డి గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు .