లూర్దుమాత పాఠశాలలో సెమీక్రిస్మస్ వేడుకలు

Published: Friday December 23, 2022

 తల్లాడ, డిసెంబర్ 22 (డిసెంబర్ న్యూస్): ప్రజలు స్నేహ, స్వేచ్ఛ వాతావరణంలో జీవించాలని ఆయన చేసిన త్యాగం మరువలేనిదని ఆయన చూపిన మార్గంసమస్త మానవాళికి మార్గదర్శకాలని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు* పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో లూర్దు మాత పాఠశాలలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ *సిస్టర్ జెస్సింత మేరీ* అధ్యక్షతన సెమీ క్రిస్టమస్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రజల్లో స్వార్థ స్వభావాలు పెరిగిపోయాయని ప్రతి ఒక్కరూ సంకుచిత భావాలు విడిచిపెట్టి స్నేహ స్వభావంలోకి రావాలని క్రీస్తు చూపిన మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో,పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ జెస్సింత్ మేరీ,సొసైటీ చైర్మన్ వీర మోహనరెడ్డి, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.